ఖిల్లాగణపురం-పెద్దమందడి, గోపాల్ పేట  మార్కెట్ కమిటీల నియామకం

 ఖిల్లాగణపురం-పెద్దమందడి, గోపాల్ పేట  మార్కెట్ కమిటీల నియామకం

వనపర్తి, వెలుగు  :  రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లాగణపురం-పెద్దమందడి, గోపాల్​పేట మార్కెట్​ కమిటీల పాలకవర్గాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీఓ జారీ చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఖిల్లాగణపురం-పెద్దమందడి  చైర్​ పర్సన్​​గా క్యామ నవనీత, వైస్​ చైర్మన్​గా కె.వెంకటేశ్వర్​రెడ్డి, గోపాల్​పేట మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎ.వెంకటేశ్, వైస్​ చైర్మన్​గా మంద సత్యశీలారెడ్డి, మరో 12 మంది డైరెక్టర్లతో  పాలకవర్గాలను నియమించిందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.